ఈ రోజుల్లో, ఈ మధ్య, చాలా మంది, కృష్ణుడి పేరు చెప్పి, భగవద్గీత పేరు చెప్పి, ఏమేమో వాగేస్తున్నారు. ముఖ్యంగా motivational speakers, హిందూ వ్యతిరేకులు. వాళ్ల మాటలను కృష్ణుడి మాటలుగా చెప్తున్నారు. అంతా కల్పితం, ఊహాజనితం, వక్రీకరణము. ఎవరికి నచ్చినట్లు వారు అభూతకల్పనలు సృష్టిస్తున్నారు.
భగవద్గీతలో ఎలాగైతే ఉందో, సరిగ్గా అలాగే చెప్తే బాగుంటుంది, దానిని మార్చి చెప్తే అంత బాగోదు.
వాళ్లను ఇలా ఈ క్రింది విధముగా ప్రశ్నిస్తే, నిలదీస్తే సమాధానం ఇవ్వలేరు.
ఎన్నో అధ్యాయములో ఎన్నో శ్లోకం?
శ్లోకం మరియు దాని తాత్పర్యం చెప్తే బాగుంటుంది.
ఎక్కడ ఉంది అలా? ఏ గ్రంథంలో ఉంది? ఏ పురాణంలో, ఏ అధ్యాయంలో, ఏ శ్లోకంలో ఉంది?
రామాయణం అయితే, ఏ కాండంలో ఉంది?
మహాభారతం అయితే, ఏ పర్వంలో ఉంది?
భగవద్గీత అయితే, ఏ అధ్యాయంలో ఉంది?
భాగవతం అయితే, ఏ స్కంధంలో ఉంది?
రామాయణం ఎంతో మంది రాశారు. కానీ, వాల్మీకి రామాయణమే మనకు ప్రామాణికం. ఎందుకంటే, వాల్మీకి శ్రీ రాముడి సమకాలీనుడు కాబట్టి. సీతాదేవికి ఆశ్రయం కల్పించారు. రాముని పరివారముతో ఎంతో సాన్నిహిత్యం ఉంది కాబట్టి. మొదట రామాయణం రచించినది వాల్మీకియే కాబట్టి.
No comments:
Post a Comment