ఆలయాల్లో వి.ఐ.పి బ్రేక్ దర్శనాలను రద్దుచేయడం అయ్యే పని కాదు. ఒకవేళ అలా జరిగితే మాత్రం, గుడులు ఎన్నో మూతపడతాయి. బోసి పోతాయి, వెలవెలపోతాయి, కళా విహీనమవుతాయి. ప్రముఖులు ఎవరూ కూడా గుడులకు రారు. దానాలు, గుప్త దానాలు చేయరు. ఆలయాలకు నిధులు సమకూరవు.
అందరూ గంటల తరబడి క్యూలైనులో నిలబడలేరు. భక్తులలో రోగులు ఉంటారు, పసి పిల్లలతో బాలింతలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు, వేలు - లక్షల మందికి ఉపాధిని కల్పించే ఉద్యోగపతులు ఉంటారు, వందల మందికి వైద్యం చేసే వైద్యులు ఉంటారు. సంఘ సేవకులు, గోవు/ధర్మ రక్షకులు కూడా ఉంటారు. అందరికీ ఆరోగ్యం, పరిస్థితులు సహకరించవు. ఆ సమయంలో ఎన్నో మంచి పనులు చేసేవారేమో? ఎన్నో ప్రాణాలను నిలబెట్టే వారేమో?
హిందువులలో చిచ్చు పెట్టడానికి, ఇది కూడా ఒక రకమైన విష ప్రచారమే. కేవలం హిందూత్వాన్నే మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇతర మతాల జోలికి మాత్రం వెళ్లే సాహసం చేయరు. ఒకవేళ నిజంగా సదుద్దేశమే ఉంటే, అలా కేవలం ఆలయాల్లోనే కాకుండా ప్రతీ చోట అమలు చేయాలి. ఆలయాల్లో వి.ఐ.పి బ్రేక్ దర్శనాలను వినియోగించే వారిలో అధికారులు, రాజకీయ నాయకులు, తీర్పులు ఇచ్చే జడ్జీలు కూడా ఉన్నారు. వారు కూడా అన్నీ చోట్ల ప్రత్యేక వసతులను, సదుపాయాలను త్యజించాలి. మరి దానికి సిద్దమా?
No comments:
Post a Comment